19 వ శతాబ్దంలో వచ్చిన తెలుగు మాస పత్రిక జనవినోదిని. పిల్లల కథలు, గేయాలు ప్రచురించిన తొలి పత్రిక ఇది. మద్రాసు స్కూల్‌బుక్ సొసైటీ ఈ పత్రికను ప్రచురించింది. వి. కృష్ణమాచార్యులు సంపాదకత్వంలో ఇది వెలువడింది.[1]

జనవినోదిని
సంపాదకులువేదము వేంకటరాయశాస్త్రి
ముద్రణకర్తమద్రాసు స్కూల్‌బుక్ సొసైటీ
మొదటి సంచిక1875
ఆఖరి సంచిక1885

చరిత్ర

మార్చు

1875 లో మొదలై 1885 వరకు పదేళ్ళ పాటు ప్రచురితమైన పత్రిక, జనవినోదిని. పిల్లల కథలు, గేయాలు ప్రచురించిన తొలి పత్రికగా దీనికి విశిష్టత ఉంది. "చిట్ల పొట్ల కాయ”, "రుంగు రుంగు బిళ్ళ" వంటి పిల్లల గేయాలను ఈ పత్రిక పచురించింది.[2]

వేదము వేంకటరాయశాస్త్రి దీనికి సంపాదకుడు. ఆయన ప్రతాపరుద్రుని కథను, కథానరిత్సాగరం కొన్ని ప్రకరణములనూ పత్రికలో ప్రచురించాడు.[3] చదలవాడ సీతారామశాస్త్రి రచించిన దక్కన్‌ పాతకథలు వరుసగా ఈ పత్రికలో వచ్చాయి.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 వేదగిరి, రాంబాబు (2012). ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువడిన గ్రంథాలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సాంసృతిక మండలి. p. 21.
  2. వెలగా, వెంకటప్పయ్య (1982). బాల సాహితీ వికాసం. విజయవాడ: సిద్ధార్థ పబ్లిషర్స్. p. 57.
  3. వెంకటరాయశాస్త్రు, వేదము (1949). జీవిత చరిత్ర సంగ్రహము. మద్రాసు: వేదము వేంకటరాయశాస్త్రి అండ్‌ బ్రదర్స్. p. 45.