ద రెసిడెన్సీ, లక్నో
రెసిడెన్సీ (ఆంగ్లం: The Residency, Lucknow) అనేది ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో ఒకే ఆవరణలో ఉన్న భవనాల సుముదాయం. నవాబు ఆస్థానంలో బ్రిటీషు ప్రతినిధికి వసతి గృహంగా వినియోగించటానికి ఇది కట్టబడింది.
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/e/e3/Residency_Lucknow_1858.jpg/220px-Residency_Lucknow_1858.jpg)
నవాబ్ సాదత్ ఆలీ ఖాన్ హయాంలో 1780 నుండి 1800 వరకు దీని నిరాణం జరిగింది. స్వాతంత్ర్య సమరంలో భాగంగా 1 జూలై 1857 నుండి 1857 నవంబరు 17 వరకు జరిగిన లక్నో దాడిలో ఈ భవన సముదాయానికి రక్తపు మరకలు అంటాయి. కల్నల్ పామర్ కుమార్తె సుసాన్నా పామర్ ఫిరంగి గుండు తాకి, హెన్రీ మాంట్గోమరీ లారెన్స్ గ్రంథాలయంలో కూర్చొని ఉండగా తుపాకీ గుండు తాకి మరణించారు. ప్రస్తుతం రెసిడెన్సీ శిథిలావస్థలో ఉంది.
బయటి లంకెలు
మార్చు- "British Residency Lucknow". Lucknow: The City of Nawabs. Archived from the original on 16 జూలై 2016. Retrieved 1 July 2016.
- "1857 Memorial Museum, Residency, Lucknow". Archaeological Survey of India. Archived from the original on 27 జూన్ 2014. Retrieved 1 July 2016.