నేనూ మనిషినే
నేనూ మనిషినే మోడరన్ థియేటర్స్ నిర్మాణంలో కృష్ణ, కాంచన, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా జి.వి.ఆర్.శేషగిరిరావు దర్శకత్వం వహించిన 1971 నాటి తెలుగు చలన చిత్రం. 1969లో విడుదలైన దో భాయి అన్న హిందీ సినిమాని నేనూ మనిషినేగా తెలుగులో పునర్నిర్మించారు. విమర్శకులు దీన్ని నోయిర్ పద్ధతికి చెందిన సినిమాగా గుర్తిస్తున్నారు.
నేనూ మనిషినే (1971 తెలుగు సినిమా) | |
నేనూ మనిషినే సినిమా పోస్టరు | |
---|---|
దర్శకత్వం | జి.వి.ఆర్.శేషగిరిరావు |
తారాగణం | కృష్ణ, కాంచన |
సంగీతం | వేదా |
ఛాయాగ్రహణం | మణి |
నిర్మాణ సంస్థ | మోడరన్ థియేటర్స్ |
భాష | తెలుగు |
నిర్మాణం
మార్చుఅభివృద్ధి
మార్చు1969లో అశోక్ కుమార్, జీతేంద్ర ప్రధాన పాత్రలుగా వచ్చిన "దో భాయి" అన్న హిందీ సినిమాని "నేనూ మనిషినే"గా తెలుగులో పునర్నిర్మించారు. ఇదే సినిమాను తమిళంలో "జస్టిస్ విశ్వనాథం"గా, కన్నడంలో "ప్రేమద కనికె"గా రీమేక్ చేశారు.[1]
నటీనటులు
మార్చు- ఘట్టమనేని కృష్ణ
- కాంచన - శారద
- గుమ్మడి వెంకటేశ్వరరావు - కృష్ణ అన్నయ్య
- కె.వి.చలం
- బేబీ శ్రీదేవి - లత, గుమ్మడి కూతురు
- కైకాల సత్యనారాయణ
- కె.వి.చలం
- సురేఖ
- జయకృష్ణ
- శకుంతల
- పొట్టి ప్రసాద్
- రామచంద్రరావు
- అర్జా జనార్ధనరావు
పాటలు
మార్చు- ఏది ఇలలోన అసలైన న్యాయం, రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- చిన్నారి వరహాల చిట్టిపొట్టి పాప, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం. పులపాక సుశీల
- చూసెనులే నా కనులే చూడని వింత, రచన: సి నారాయణ రెడ్డి, గానం. పి. సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- పాలరాతి మందిరాన పడతి బొమ్మ అందం అనురాగ గీతిలోన అచ్చతెనుగు అందం రచన: సినారె, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పిసుశీల
- అరె ఎలా దెబ్బకొట్టావో తెలియకున్నది నువ్వు, రచన:కొసరాజు, గానం.కె.జమునారాణి,పిఠాపురం
- ధర్మమార్గాన పయనించినావు,రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- పదవి కర్తవ్యంమును కోరుతుంది, రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- ముద్దులు చిలికే గొబ్బెమ్మా ఏ ముంగిటకెళతావో, రచన: సి నారాయణ రెడ్డి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
థీమ్స్ & జాన్రా
మార్చువిమర్శకుడు ఎం.సికందర్ నేనూ మనిషినే సినిమా కథాపరంగా నోయర్ జాన్రాకు చెందుతుందని వర్గీకరించారు. గుమ్మడి పాత్ర, శైలి, జడ్జిగా ఉండి హత్య చేయడం వంటి అంశాలు దీనికి తోడ్పడుతున్నాయని పేర్కొన్నారు.[1]
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: జి.వి.ఆర్.శేషగిరిరావు
రచన: రాజశ్రీ
సంగీతం: వేదా
పాటలు:కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి
నేపథ్య గానం: కె.జమునారాణి, పిఠాపురం నాగేశ్వరరావు, పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
ఛాయా గ్రహణం: మణి
నిర్మాణ సంస్థ: మోడరన్ థియేటర్స్
విడుదల:16:10:1971.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 ఎం, సికిందర్. "డార్క్ మూవీస్ లో ఏముండాలి?-6". సినిమా స్క్రిప్ట్ & రివ్యూ. Archived from the original on 29 మే 2017. Retrieved 29 మే 2017.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.