పలమనేరు పురపాలక సంఘం

పలమనేరు పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరుకు చెందిన మున్సిపాలిటీ.ఈ పురపాలక సంఘం చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం లోని, పలమనేరు శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

పలమనేరు పురపాలక సంఘం
పలమనేరు
స్థాపన2005
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

పలమనేరు పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులోని మునిసిపాలిటీ.2005 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మునిసిపాలిటీగా స్థాపించబడింది.ఈ పురపాలక సంఘం 17.76.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.24 ఎన్నికల వార్డులు ఉన్నాయి.

జనాభా గణాంకాలు

మార్చు

2001 జనాభా లెక్కల ప్రకారం 43493 గా ఉన్న పట్టణ జనాభా 2011 లో 51163 కు పెరిగింది. దశాబ్దంలో 1.17% పెరిగింది.

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా సి. శారద, [1] వైస్ చైర్మన్‌గా చాంద్ బాషా పనిచేస్తున్నారు.[1]

ఇతర వివరాలు

మార్చు

ఈ పురపాలక సంఘం 17.76.చ.కి.మీ.విస్తీర్ణం కలిగి ఉంది.34 రెవెన్యూ వార్డులు,26 ఎన్నికల వార్డులు ఉన్నాయి.ఈ పురపాలక సంఘంలో 36 మురికివాడలు ఉండగా అందులో జనాభా 20467 ఉన్నాయి. ఒక ప్రభుత్వ ఆసుపత్రి,21 ప్రభుత్వ పాఠశాలలు, ఒక కూరగాయల మార్కెట్ ఉన్నాయి.3 ఉన్నత పాఠశాలలు,5 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు,13 ప్రాథమిక పాఠశాలలు,14 బరయల్ గ్రౌండ్స్,3 పబ్లిక్ పార్కులు ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

మార్చు