విశ్వ హిందూ పరిషత్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
విశ్వ హిందూ పరిషత్ ను సంక్షిప్తంగా వి.హెచ్.పి అంటారు. ఇది భారతదేశంలోని హిందూ మితవాద సంస్థ, హిందుత్వ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. ఇది 1964 లో స్థాపించబడింది, దీని ప్రధాన లక్ష్యం హిందూ సమాజమును ఏకీకృతం చేయడం, సేవ చేయడం, హిందూ ధర్మాన్ని రక్షించడం. విశ్వ హిందూ పరిషత్ హిందూ జాతీయ సంస్థల యొక్క గొడుగు సంఘ్ పరివార్ కు చెందినది. ఇది హిందూ దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణలలో, గోసంరక్షణ, మత మార్పిడి వంటి అంశాలలో ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది.
విశ్వ హిందూ పరిషత్ లోగో విశ్వ హిందూ పరిషత్ లోగో | |
రకం | హిందూ జాతీయవాదం హిందూ సంస్కరణ |
---|---|
స్థాపించిన తేదీ | 29 ఆగస్టు 1964 |
స్థాపకులు | కేశవరాం కాశీరాం శాస్త్రి స్వామి చిన్మయనంద జయచామరాజేంద్ర వడియార్[1] గురువు తారా సింగ్ ఎస్.ఎస్.ఆప్టే సద్గురు జగ్జీత్ సింగ్ |
ప్రధాన కార్యాలయం | |
భౌగోళికాంశాలు | 28°20′N 77°06′E / 28.33°N 77.10°E |
ముఖ్యమైన వ్యక్తులు | G.రాఘవరెడ్డి (అధ్యక్షుడు)[2] ప్రవీణ్ తొగాడియా (కార్యనిర్వాహక అధ్యక్షుడు)[2] |
సేవా పరిధి | భారతదేశం |
సభ్యులు | 6.8 మిలియన్[3] |
సహాయకారులు | భజరంగ్ దళ్ (యువజన విభాగం) దుర్గా వాహిని (మహిళా విభాగం) |
ఆదర్శ వాక్యం | ధర్మో రక్షతి రక్షితః धर्मो रक्षति रक्षितः |
అంతర్జాలం | (ఆంధ్రప్రదేశ్ శాఖ జాలస్థలి) |
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/c/c0/An_old_building_at_Haridwar.jpg/220px-An_old_building_at_Haridwar.jpg)
విశ్వ హిందూ పరిషత్ ను కేశవరాం కాశీరాం శాస్త్రి 1964 లో స్థాపించారు. హిందూ ఆధ్యాత్మిక నేత స్వామి చిన్మయానంద, పూర్వ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడు ఎస్.ఎస్.ఆప్టే, నందారి సిక్కుల యొక్క ఉన్నత ఆధ్యాత్మిక అధిపతి సద్గురు జగ్జీత్ సింగ్, సిక్కు నాయకుడు మాస్టర్ తారా సింగ్ సహ వ్యవస్థాపకులు. దీనికి చిన్మయనంద వ్యవస్థాపక అధ్యక్షుడిగా, ఆప్టే వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు.
"విశ్వ హిందూ పరిషత్" అనే ఈ పేరును సంస్థ సమావేశంలో ప్రతిపాదించి నిర్ణయించారు, 1966 లో కుంభ మేళా ప్రారంభ సమయంలో ప్రయాగ (అలహాబాద్) వద్ద హిందువుల ప్రపంచ సదస్సు నిర్వహించారు.
వి.హెచ్.పి మొదటి చర్చనీయాంశ సమావేశం పవాయ్, సాందీపుని సంధ్యాలయ, బొంబాయిలో 1964 ఆగస్టు 29 న జరిగింది. కృష్ణాష్టమి పండుగ నాడు ఏర్పాటుచేసుకున్న ఈ సమావేశానికి ఆర్.ఎస్.ఎస్ అధినేత ఎం.యస్.గోల్వాల్కర్ ఆతిథ్యం వహించారు. హిందూ, సిక్కు, బౌద్ధ, జైన మతస్తుల నుండి అనేకమంది ప్రతినిధులు, అలాగే దలైలామా ఈ సమావేశానికి హాజరయ్యారు.
"భారత మూలాలకు చెందిన అన్ని మత విశ్వాసాలను ఏకం చేయాలి" అని "హిందూ" ("హిందూస్తాన్" ప్రజలు) అనే పదం చెబుతుందని కావున అన్ని మతాలకు చెందిన అనుయాయులకు ఇది వర్తించబడుతుందని గోల్వాల్కర్ వివరించారు.
ఆప్టే ప్రకటన:
- ఈ ప్రపంచం క్రైస్తవ, ఇస్లాం , కమ్యూనిస్ట్ గా విభజించబడింది. ఎంతో ఉన్నతంగా ఉన్న హిందూ సమాజాన్ని ఆహారంగా భుజించేందుకు అవి అన్ని చూస్తున్నాయి. ఈ మూడింటి యొక్క కీడుల నుంచి హిందూ ప్రపంచాన్ని రక్షించడానికి ఈ కాలంలో సంఘర్షణ అవసరం అని భావించాలి , నిర్వహించాలి.
భావజాలం:
విహెచ్పి ఒక తీవ్రమైన మితవాద సంస్థ, దీని భావజాలం హిందూ మతం కేంద్రీకృతమై ప్రపంచవ్యాప్తంగా హిందువుల సంక్షేమం, శ్రేయస్సుపై దృష్టి పెడుతుంది. వారు తరచూ మతపరమైన ఆసక్తికి కారణమవుతారు, మత మార్పిడులను అరికట్టడానికి ప్రయత్నిస్తారు.
బౌద్ధులు, జైనులు, సిక్కులతో పాటు స్థానిక గిరిజన మతాలను గొప్ప హిందూ సోదరభావంలో భాగంగా భావించే వీహెచ్పీ, దీనిని "భారతీయ ఋషుల శక్తి" స్థాపించినట్లు అధికారికంగా పేర్కొంది. 1964 ఆగస్టు 29 న ముంబైలోని సందైపని సాధనాలయలోని పవైలో జరిగిన సమావేశంలో విహెచ్పిని మొట్టమొదటిసారిగా ఎంపిక చేశారు. ఈ సమావేశాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ ఎం.ఎస్. శ్రీ కృష్ణాజన్మాష్టమి పండుగకు అనుగుణంగా తేదీని ఎంచుకున్నారు. ఈ సమావేశంలో హిందూ, సిక్కు, బౌద్ధ, జైన విశ్వాసాలకు చెందిన పలువురు ప్రతినిధులు, దలైలామా పాల్గొన్నారు. "భారతీయ మూలాల యొక్క అన్ని విశ్వాసాలు ఏకం కావాలి" అని గోల్వాల్కర్ వివరించాడు, "హిందూ" ("హిందుస్తాన్" ప్రజలు) అనే పదం పై మతాలన్నింటికీ అనుచరులకు వర్తింపజేసింది...
మూలాలు
మార్చు- ↑ Ikegame, Aye (2013). Princely India Re-imagined: A Historical Anthropology of Mysore from 1799 to the present. Routledge. p. 67. ISBN 9781136239090.
- ↑ 2.0 2.1 "VHP President Raghava Reddy". Archived from the original on 2013-12-07. Retrieved 2013-12-17.
- ↑ VHP mebership count